సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్కి జోడీగా పూజా హెగ్డే తొలిసారిగా నటించిన ఈ సినిమాలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్కి టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ‘మహర్షి’ తర్వాత మహేష్ బాబు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం విదితమే. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నాడని సమాచారం. కాగా… జూన్ నెలాఖరు నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందనీ…‘దూకుడు’ తర్వాత తను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లో నటిస్తున్న చిత్రమిదేనని… తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ స్వయంగా వెల్లడించాడు.
మరి… 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా కూడా ‘దూకుడు’ లాగే మహేష్ కెరీర్కి మరింత ప్లస్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=dBMx5DzFovg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: