సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం… జూలై నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు టాక్. కథానుసారం ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అంతేకాదు… ఈ సినిమాలో మహేష్ పాత్ర పేరు అజయ్ జోసెఫ్ అని వినికిడి. గతంలో అజయ్ పేరుతో మహేష్ నటించిన ‘ఒక్కడు’, ‘దూకుడు’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… మరోసారి మహేష్కు అజయ్ పేరు కలిసొచ్చి హ్యాట్రిక్ విజయం అందుతుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ‘దిల్’ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించనుందని టాక్. అంతేకాదు… సుదీర్ఘ విరామం తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వబోతుండగా… ఆమెతో పాటు సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. అలాగే… జగపతిబాబు, బండ్ల గణేష్ కూడా ముఖ్య భూమికలను పోషించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి భారీ కాస్టింగ్తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. కాగా… 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=C8c5we6sJbk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: