సూపర్స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. సి.అశ్వనీదత్, దిల్
రాజు, ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో మహేష్ ప్రాణ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో నరేష్ పాత్ర చనిపోతుందనీ… అతని ఆశయాన్ని నెరవేర్చడం కోసమే యు.ఎస్.లో ఉన్న మహేష్ ఇండియాకు వస్తాడని ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నరేష్ పాత్ర చనిపోదనీ… రైతుల సమస్యలపై పోరాడే అతనికి సహాయపడడానికే మహేష్ ఇండియాకు వస్తాడని తెలుస్తోంది. అంతేకాదు… ఈ చిత్రంలో నరేష్ తన అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్ కెరీర్లో 25వ చిత్రమైన ‘మహర్షి’… నరేష్ కెరీర్ను ఏ విధమైన మలుపు తిప్పుతుందో తెలియాలంటే… మే 9 వరకు ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=Gi5xB4ZlXNE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: