మెగా కాంపౌండ్ హీరో సాయి (ధరమ్) తేజ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన చిత్రం ‘చిత్రలహరి’. సాయి తేజ్ కి జోడిగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మ్యూజికల్ ఎంటర్ టైనర్ ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా… రేపు (ఏప్రిల్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించి రూ.13 కోట్ల మేర ముందస్తు విడుదల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓ విధంగా చెప్పాలంటే… ఇది రీజనబుల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనే చెప్పాలి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్న నేపథ్యంలో… ఈ సినిమాకున్న బజ్ రీత్యా పాజిటివ్ టాక్ వస్తే చాలు… లాభాల పంట పండడం ఖాయం.
మరి… సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సాయి తేజ్ కి ‘చిత్రలహరి’ ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: