ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో, సీత పాత్రలో కృతీసనన్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా తనకు ఉన్న క్రేజ్ కారణంగా ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాడానికి చిత్రయూనిట్ మరింత టైమ్ తీసుకోవడంతోనే ఈసినిమా రిలీజ్ కు లేట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అప్ డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ రాక్షసులు పై చేసే యుద్ధం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తోందట. సముద్రంలో జరిగే ఈ యుద్ధం విజువల్స్ ప్రేక్షకులకు 3డి లో అద్భుతమైన అనుభూతిని ఇస్తాయట. మరి అది ఎక్స్ పీరియన్స్ చేయాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ స్థాయిలో 2023 జూన్ 16 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: