పాన్ ఇండియా సినిమాలపై గత కొద్ది రోజులుగా సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలు అంటూ వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ వివాదం పై టాలీవుడ్ నుండి అలాగే బాలీవుడ్ నుండి కూడా చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు కూడా. ఇక ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై మహేష్ చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించి రాయడం జరిగింది. తాజాగా ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన మహేష్ కు బాలీవుడ్ ఎంట్రీ పై క్వశ్చన్ మాత్రం రాకుండా ఉండదు. దీనికి మహేష్ కూడా తన పద్దతిలోనే ఆన్సర్ ఇస్తుంటారు. ఇప్పటికే ఈ ప్రశ్న ఎన్నో సార్లు ఎదురైనా తనకు తెలుగు ఇండస్ట్రీలో బాగానే ఉందని.. ఇక్కడే సినిమాలు చేస్తానని చెప్పారు. ఇక సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా మళ్లీ అదే ప్రశ్న ఎదురవ్వగా.. బాలీ వుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరని.. టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని మహేష్ స్పష్టం చేశారు. తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలకు పని చేయాలనే ఆలోచన తనకు లేదని. తెలుగులోనే మరిన్ని సినిమాలు తీసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
అయితే మహేష్ చేసిన వ్యాఖ్యలు కొందరు బాలీవుడ్ నెటిజన్లు వక్రీకరించి పలు కామెంట్లు చేస్తున్నారు. దీంతో మహేశ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్పై నేను ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. అంతేకాదు తను రాజమౌళి తో చేయబోయే సినిమా పాన్ ఇండియా సినిమా అని కూడా సమాధానమిచ్చారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: