సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఐశ్వర్య తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కరోనా వచ్చిందని… పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు ఐశ్వర్య తెలిపారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి.. సురక్షితంగా ఉండండి.. 2022 నాకోసం ఇంకేం తీసుకొస్తుందో అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే కదా. తమ 18 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈమధ్య విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతా పేరు మార్చేస్తున్న నేపథ్యంలో ఐశ్వర్య తన పేరులో నుంచి ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: