న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం మరో భారీ సెట్ వేయనున్నట్టు తెలుస్తుంది. దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హైద్రాబాద్ శివారులో ఒక విలేజ్ సెట్ ను నిర్మించనున్నారట. దాదాపు 12 ఎకరాల్లో ఈ విలేజ్ సెట్ ను ఏర్పాటు చేయనున్నారట. సినిమాలో చాలా భాగం వరకూ ఈ సెట్ లోనే తెరకెక్కించనున్నట్టు సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నే ఈ సినిమా కోసం కూడా పనిచేయనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమా కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించునున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కాగా ఈసినిమాలో నాని సరసన కీర్తిసురేష్ మరోసారి హీరోయిన్ గా నటించనుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: