కరోనా మహమ్మారి ఫస్ట్ , సెకండ్ వేవ్ లతో ప్రపంచవ్యాప్తం గా ప్రజలను పలు విధాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ తో విజృంభించి ప్రజలపై తన ప్రతాపం చూపుతుంది. రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుంది. రోజుల వ్యవధిలో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు కరోనా పాజిటివ్ అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get well soon Anna. Sending you strength and prayers.
— Jr NTR (@tarak9999) January 6, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు కు పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. త్వరగా కోలుకో అన్నా.. మీ ఆరోగ్యం కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో మహేష్ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరిద్దరికీ రామ్ చరణ్ కూడా మంచి మిత్రుడు. గత సంవత్సరం
ఎన్టీఆర్ కి కరోనా సోకిన నేపథ్యంలో మహేష్ బాబు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: