మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు కాదు.. ఈయన ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా దీనితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నాడు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్.. ఇంకా బాబి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక చిరు కూడా పార్లల్ గా మూడు సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే భోళా శంకర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు చిరు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించినట్టు సమాాచారం. ఇక సెకండ్ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసేసింది చిత్రయూనిట్. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.
కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























