ఆది సాయికుమార్ ఇప్పుడు ఫుల్ జోరు పెంచిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు లిస్ట్ లో ఉండగా వాటితో పాటు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తున్న సంగతి విదితమే. కల్యాణ్జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లగా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది మూడు వేరియేషన్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఇంకా ఈసినిమాతో పాటు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో మరో సినిమా వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: