మళ్లీ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా విషాద ఛాయలు అలుముకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది ఇండస్ట్రీ. రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనావల్ల తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఆయన్ని అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతుండగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఈవిషయం తెలుసుకున్న ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురై సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఈసినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన రాశారు. 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని సైతం దక్కించుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: