‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం‘. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన హే రంభ, చెప్పకే చెప్పకే.. పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 23న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Setting up our 1st Sail⛵in the Tale of #ImmeasurableLove ❤️#MahaSamudram Voyage Begins on 23rdSep with an Engrossing Trailer❤️🔥@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic#MahaSamudramonOct14th pic.twitter.com/1Zbx4cdEn4
— AK Entertainments (@AKentsOfficial) September 20, 2021
కాగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మరి చాలాకాలం తరువాత సిద్ధార్థ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. అంతేకాకుండా అజయ్ భూపతి కూడా ఆర్ఎక్స్ 100 తరువాత చేస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: