శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.భాషాపరంగా తాను ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదని, నవ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ పాన్ఇండియా తారగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మాతృచిత్రసీమ కన్నడకు రష్మిక దూరమైపోయిందనే విమర్శలు రావడంతో రష్మిక స్పందించారు. హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేసినా కావాల్సినంత గుర్తింపు వస్తుందనీ , అదే కథానాయికలైతే నాలుగైదు సినిమాలు చేయాల్సి ఉంటుందనీ , ఈ కారణం వల్ల హీరోయిన్లు ఒకే భాషకు పరిమితమైపోవడం మంచిదికాదనీ , భాషాపరంగా కాకుండా కథల ఎంపికలో కొత్తదనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే ధోరణి పెరిగిందనీ , తాను కూడా అదే పంథాను అనుసరిస్తున్నాననీ , కథలో వైవిధ్యం ఉంటే ఏ భాషా చిత్రంలో నటించడానికైనా అభ్యంతరం లేదనీ , కథల ఎంపికలో భాషాపరమైన హద్దులు విధించుకోలేదనీ రష్మిక చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























