యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్”నేనే నా .. ?! ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెన్నెల కిషోర్ , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. రెజీనా ఆర్కియాలజిస్ట్ గా నటించారు. చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్ రెజీనా సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని రెజీనా అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “నేనే నా .. ?! ” మూవీ కి రాజశేఖర వర్మనిర్మాత. ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్ కథాంశమిదనీ , .ఆర్కియాలజిస్ట్గా రెజీనా పాత్ర నవ్యరీతిలో ఉంటుందనీ , ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుందనీ చెప్పారు.త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. హీరోయిన్ రెజీనా ప్రస్తుతం “శాకినీ ఢాకినీ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























