గత రెండు మూడు నెలలుగా షూటింగ్స్ లేక చిత్రపరిశ్రమ బోసిపోయింది.అయితే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన సినిమాలను వరుసగా లైన్ లో పెడుతున్నాడు. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇకఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈవిషయాన్ని రష్మిక తన ఇన్స్టా ద్వారా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మరోవైపు శ్రీకార్తీక్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కరోనా వల్ల పలు బ్రేక్ లు రాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. సైన్స్ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























