భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రెండు పార్ట్ లుగా వస్తున్నట్టు రెండు రోజుల నుండి వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుంది. ఈనేపథ్యంలోనే నేడు చిత్రయూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘స్వర్ణయుగం వస్తుంది’ అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఖడ్గం, కవచం, అందులో పులి గర్జించినట్టుగా ఉన్న ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచేస్తుంది. అంతేకాదు‘పి.ఎస్. 1’ 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The golden era comes to life! #PonniyinSelvan #PS1 #ManiRatnam @MadrasTalkies_ pic.twitter.com/RHbwDoMv22
— Lyca Productions (@LycaProductions) July 19, 2021
ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























