“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సక్సెస్ ఫుల్ “దోచేయ్ “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ సీత పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీలో క్యారెక్టర్ కై కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కృతి సనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చాననీ ,బాలీవుడ్లో ఈ స్థాయికి ఎదుగుతానని తాను ఎప్పుడూ అనుకోలేదనీ , మాది మధ్య తరగతి కుటుంబం. అమ్మ ప్రొఫెసర్, నాన్న చార్టెడ్ ఎకౌంటెంట్ అనీ , విద్యావంతుల కుటుంబం కావడం తో చదువు పైనే తన దృష్టి అనీ , ఇంజినీరింగ్ చదివాననీ , నటనను కెరీర్గా తీసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదనీ , బాలీవుడ్ లో మంచి అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కిందనీ , భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రభాస్, అక్షయ్కుమార్ వంటి అగ్రహీరోల సరసన హీరోయిన్గా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ , 6సంవత్సరాల తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాననీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























