బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌనత్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ఫరైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ నేడు ముంబైలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే మొదలుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here are few pictures from #Prabhas‘s #Adipurush movie launch ceremony that took place today.@omraut #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @retrophiles1 pic.twitter.com/rXh1v4NR3P
— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2021
కాగా మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























