మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్. వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Your silence will protect you.#NishabdhamOnPrime, premieres October 2 in Telugu and Tamil, with dub in Malayalam!#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @actorsubbaraju #ShaliniPandey @hemantmadhukar #TGVishwaPrasad @konavenkat99 @vivekkuchibotla pic.twitter.com/pgV6fiHSvC
— amazon prime video IN (@PrimeVideoIN) September 18, 2020
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: