తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్ కొన్ని నెలల క్రితం శాకాహారి (వేగన్ ) గా మారిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ రోజున “PETA ” సంస్థతో చేతులు కలిపి వేగనిజం ను రకుల్ ప్రమోట్ చేస్తున్నారు. శాకాహారం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు నియంత్రణ , కిడ్నీ ఫంక్షనింగ్ , కొన్ని రకాల కేన్సర్స్ ను అడ్డుకొనడం , హార్ట్ డిసీజెస్ ను దూరం చేయడం, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించడం వంటి ఉపయోగాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ రకుల్ ఇప్పుడు శాకాహారపు అలవాటు పై ప్రజలలో అవగాహన కలిగించడానికి మిలియన్ డాలర్ వేగన్ సంస్థ తో జత కట్టారు. ముంబై లోని ధారవి మురికివాడ లో కరోనా విజృంభించి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ధారవి లో నివాసమున్న పేదలకు ఈ నెల 11 , 12, 18, 19 తేదీలలో మిలియన్ డాలర్ వేగన్ సంస్థ 4 వేల వేగన్ మీల్స్ ను అందజేస్తుంది. అంతే కాకుండా కరోనా మహమ్మారి వ్యాప్తి ని ఎదుర్కొనడానికి ఈ బృందం అవగాహన కలిగిస్తుంది. రకుల్ మాట్లాడుతూ .. ఈ క్లిష్ట పరిస్థితులలో ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడడం , కరోనా అరికట్టడానికి అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: