వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత తాను నటించే మూవీ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. సూపర్ హిట్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో SSMB 27 మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31 వ తేదీ) సందర్భంగా తన మూవీ అప్ డేట్స్ ను వెల్లడించే మహేష్ బాబు ఆ రోజు తన మూవీ కై ఎదురుచూస్తున్న అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ SSMB 27 మూవీ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. దర్శకుడు పరశు రామ్ మాట్లాడుతూ .. విజయ్ దేవరకొండ తో “గీత గోవిందం “మూవీ రూపొందిస్తున్న టైమ్ లోనే స్క్రిప్ట్ రెడీ చేశానని, ఇది ఒక ప్రామిసింగ్ స్క్రిప్ట్ అని, ఆసక్తికర అంశాలతో ప్రేక్షక , అభిమానులను అలరించే స్క్రిప్ట్ అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































