బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అంత ఈజీ కాదు అంటుంది రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్. శివాని అలా అనడానికి కారణం కూడా లేకుండా పోలేదు. నిజానికి శివాని గత కొన్నేళ్లుగా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో శివాని టూ స్టేట్స్ తెలుగు రీమేక్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. అడవిశేష్, శివానీ కాంబోలో ఫైనల్ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవల ఓ ఛానల్ తో ముచ్చటించిన శివాని తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మధ్యలో సినిమా ఆగిపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచే విషయమే.. కానీ దీని వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాను. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ సినిమా రావడం అంత ఈజీ కాదు… నేను దాదాపు ఐదేళ్ల నుండి ట్రై చేస్తున్న ఎంట్రీ ఇవ్వడానికి ఇంతవరకూ అవ్వలేదు.. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను.. రిజెక్ట్ అయ్యాను.. నేపోటిజం అన్నది అందరికి వర్క్ అవుట్ అవుతదని చెప్పలేం అని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా…ఇన్నేళ్ల కష్టం తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. యూత్ఫుల్ రొమాంటిక్ కథాంశంతో రానున్న సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జతో డైరెక్టర్ మల్లిక్ రామ్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో శివానిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: