“నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “బొమ్మరిల్లు “, “జబర్దస్త్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ తరువాత తమిళ మూవీస్ తో బిజీగా మారారు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ తెలుగు లో ఒక మల్టీ స్టారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్ కు సిద్ధార్థ్కమ్ బ్యాక్ మూవీ గా ఈ మల్టీ స్టారర్ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ “మహాసముద్రం ” మల్టీ స్టారర్ మూవీ రూపొందనుంది. యంగ్ హీరో శర్వానంద్ ఒక హీరోగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోగా సిద్ధార్థ్ ఎంపిక అయ్యారు. “మహాసముద్రం ” మూవీ లో సాయి పల్లవి ఒక హీరోయిన్ కాగా మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయినతరువాత అధికారిక ప్రకటన వెలువడనుంది. దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫైనల్ టచెస్ ఇస్తూ బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























