బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా… గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన ఐదో సినిమాను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మ వినిపించిన కథ అఖిల్ కి నచ్చిందట. దీనితో ప్రశాంత్ వర్మ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్స్ విపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ కూడా కాజల్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడట..ఐతే అది లేట్ అవుతుండటంతో అఖిల్ ను లైన్లో పెట్టేట్టినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























