GMB ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాల సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ మూవీ లో విజయ శాంతి పాత్ర కీలకం గా ఉంటుందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరు నీకెవ్వరు మూవీ ఫస్ట్ షెడ్యూల్ జులై 5వ తేదీ కాశ్మీర్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ షూటింగ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. సెకండ్ షెడ్యూల్ జూలై26 వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, రష్మిక లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించనున్నారు. కర్నూల్ కొండారెడ్డి ఫోర్ట్ లోని ఒక భాగమైన కొండారెడ్డి బురుజు సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీ లో 4కోట్ల రూపాయలతో నిర్మాతలు రూపొందిస్తున్నారు. రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించిన తరువాత చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీ కి షిఫ్ట్ అవుతారు.
[youtube_video videoid=TkA7tJ_hWSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: