చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో ‘ఇంటింటి రామాయణం’ ఒకటి. మూడు జంటల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చంద్రమోహన్ – జయసుధ, రంగనాథ్ – ప్రభ, నూతన్ ప్రసాద్ – రమాప్రభ ఆ జంటలుగా నటించారు. పి.సాంబశివరావు దర్శకత్వంలో నవతా ఆర్ట్స్ అధినేత ఎన్. కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో పలు చోట్ల శతదినోత్సవం జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత దర్శక ద్వయం రాజన్ – నాగేంద్ర స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలువారిన “మల్లెలు పూసే వెన్నెల కాసే”, “వీణ వేణువైన సరిగమ విన్నావా” పాటలు నిత్యనూతనంగా ఉంటాయి. అలాగే ఆరుద్ర రచించిన టైటిల్ సాంగ్ “ఇంటింటి రామాయణం” పాట ఆలుమగల మధ్య అనుబంధాన్ని అద్దం పడుతుంది. 1979 జూన్ 22న విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఇంటింటి రామాయణం’… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=pS8Gw10SleE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: