యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతుంది. భీష్మ మూవీ రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే . ప్రస్తుతం భీష్మ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రుతుపవనాల రాకతో నిన్న తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టి వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కువ శాతం ప్రజలు మెట్రో రైళ్ళను ఆశ్రయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ షూటింగ్ ముగించుకొని హెవీ ట్రాఫిక్ నుండి తప్పించుకొనడానికి రసూల్ పురా మెట్రో స్టేషన్ నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మెట్రో రైల్ లో ప్రయాణించారు. తొలిసారి మెట్రో రైల్ లో ప్రయాణించిన హీరో నితిన్ సెల్ఫీ లు తీసుకొని, మెట్రో జర్నీ ఎంతో బాగుందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సడన్ గా మెట్రో రైల్ లో ప్రత్యక్షమైన సినీ హీరో నితిన్ తో ప్రయాణీకులు సెల్ఫీ లు తీసుకున్నారు.
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: