మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డిస్కో రాజా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తనతో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో మరోసారి జట్టు కట్టనున్నాడు ఈ మాస్ హీరో. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజకు కలిసొచ్చిన హీరోయిన్ని కథానాయికగా ఎంపిక చేసే పనిలో ఉన్నాడట గోపీచంద్ మలినేని. ఆ హీరోయిన్ మరెవరో కాదు… శృతి హాసన్.
‘గబ్బర్ సింగ్’, ‘రేసుగుర్రం’, ‘బలుపు’, ‘శ్రీమంతుడు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్గా నటించిన శృతి హాసన్… గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. ఇటీవలే ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగులోనూ మంచి కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ తరుణంలోనే గోపీచంద్ మలినేని చెప్పిన కథకు ఇంప్రెస్ అయి… రవితేజతో మరోసారి కలసి నటించడానికి ఓకే చెప్పిందట. మొత్తమ్మీద… ‘బలుపు’లో హీరోహీరోయిన్లుగా అలరించిన రవితేజ, శృతి హాసన్ జంట… ఇప్పుడు మరోసారి ఆడియన్స్ను మెస్మరైజ్ చేయడానికి సిధ్ధపడుతోందన్నమాట.శృతి ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=zrG2PzmMMR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: