యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘సాహో’ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే రోజున (ఆగస్టు 15) విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు. కట్ చేస్తే… అదే రోజున బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’తో పాటు… జాన్ అబ్రహాం నటిస్తున్న హిందీ చిత్రం ‘బాట్లా హౌస్’ కూడా రిలీజ్ కానున్నట్టు ఆ యా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీంతో… ఒకే రోజున మూడు పెద్ద సినిమాలు విడుదలైతే ఆ ప్రభావం భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘సాహో’ కలెక్షన్స్ పై పడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
తాజా సమాచారం ఏంటంటే… ఇప్పుడు సాహో
టీమ్కి రిలీఫ్ ఇచ్చే నిర్ణయాన్ని ‘మిషన్ మంగళ్’ టీమ్ తీసుకుందని బాలీవుడ్ టాక్. అదేమిటంటే… ముందుగా అనుకున్నట్టుగా ‘మిషన్ మంగళ్’ను ఆగస్టు 15న కాకుండా ఒక వారం ముందుగా అంటే ఆగస్టు 9న విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ ‘మిషన్ మంగళ్’ విడుదల తేదీ మారితే… జాన్ అబ్రహాం మూవీ ‘బాట్లా హౌస్’ రిలీజ్ డేట్పై కూడా ఆ చిత్ర నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే… ఈ రెండు సినిమాల విడుదల తేదీలకు సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి… ఈ రెండు సినిమాలు పంద్రాగస్టు రేసు నుంచి తప్పుకుంటే ‘సాహో’ హిందీ వెర్షన్కి అది కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
[subscribe]
[youtube_video videoid=tiZGMxe5B-M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: