ప్రేమలు తో బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ హీరోయిన్ మిమిత బైజు. ఈసినిమా తరువాత తను నెక్స్ట్ డ్యూడ్ తో వస్తుంది. లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించగా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరోయిన్ మమిత బైజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మమల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్యు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రదీప్ గారితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ . డ్యూడ్ సినిమా అక్టోబర్ 17 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్ లో వాచ్ చేయండి అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























