యువ కథానాయకుడు నితిన్ కథానాయకుడిగా `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `భీష్మ` పేరుతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. కాగా… ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయని తెలిసింది. అంతేకాదు… ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో యూనిట్ ఉందట. శరవేగంగా చిత్రీకరణ జరిపి… జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడుతాయి. `అ ఆ` తరువాత సరైన విజయం లేని నితిన్కి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మరి… `భీష్మ`తోనైనా నితిన్ సక్సెస్ ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=v09iGbZdp-g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























