తిరుమల సందర్శించిన మీనాక్షి చౌదరి

Actress Meenakshi Chaudhary Visits Tirumala Srivari Temple

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్‌ మీనాక్షి చౌదరి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మీనాక్షికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీనాక్షి మొక్కులు చెల్లించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలియుగ దైవం దర్శనానంతరం ఆలయం చెంతనేగల రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. అలాగే ఆమెను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. కాగా ప్రస్తుతం ఆమె నాగచైతన్య హీరోగా చేస్తోన్న #NC24 (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.