దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన తాజాగా ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ (వేవ్స్) సమ్మిట్’ (Waves- 2025)ను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. కాగా ఈ సదస్సు మే 1 నుంచి మే 4 వరకు జరగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సమ్మిట్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “గత కొన్నేళ్లుగా ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు అద్భుతమైన గౌరవం దక్కుతోంది. దీని వెనుక ఎందరో ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నిషియన్స్ ఉన్నారు. రజనీకాంత్, మోహన్లాల్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎఆర్ రెహమాన్, ఎస్ఎస్ రాజమౌళి వంటి పలువురు సినీ ప్రముఖుల కృషి ఉంది.” అని పేర్కొన్నారు.
అలాగే తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో.. వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ దీని గురించి ప్రత్యేకంగా గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించిందన్న ఆయన, అందుకు నిదర్శనం ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ దక్కడమేనని అన్నారు.
“రాజమౌళి సినిమాలు, ఏఆర్ రెహమాన్ సంగీతం.. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశాయని తెలిపారు. రష్యాలో రాజ్ కపూర్ క్రేజ్, కేన్స్లో సత్యజిత్ రే పాపులారిటీ, ఆస్కార్లో ఆర్ఆర్ఆర్ విజయం దీనికి సాక్ష్యంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ. ఇక వేవ్స్ వేదికగా భారతీయ సినిమాకు చెందిన 5గురు దిగ్గజ వ్యక్తులు గురుదత్, పి భానుమతి, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరిలపై స్మారక పోస్టల్ స్టాంపులను మోదీ విడుదల చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: