మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కింది. ఇక విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ L2: ఎంపురాన్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో దీనిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రీ సేల్స్ బుకింగ్స్ తోనే రూ.70కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అలాగే విడుదల తర్వాత ఇదే ఊపును కొనసాగించింది.
ఈ నేపథ్యంలో L2: ఎంపురాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ వేదికగా నిన్న రాధారాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సహా తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఇది అందుబాటులోవుంది.
కాగా మలయాళ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం గమనార్హం. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో దీనిని తెరకెక్కించారు మేకర్స్. ఇక ఇందులో మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించారు.
కథ:-
తొలి భాగం లూసిఫర్లో.. తండ్రి హఠాన్మరణంతో తన సవతి సోదరుడు జతిన్ రాందాస్ (టొవినో థామస్)కు అధికారం అప్పగించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను అధిగమించి తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగేలా చేస్తాడు స్టీఫెన్ (మోహన్ లాల్). ఈ రెండో భాగం లూసిఫర్ 2: ఎంపురాన్లో.. జతిన్ రాందాస్ ని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత స్టీఫెన్ విదేశాల్లో స్థిరపడినట్లు చూపిస్తారు.
కానీ అనూహ్యంగా జతిన్ సీఎం పదవిలో ఉండగానే తండ్రి వారసత్వాన్ని, ఆయన పార్టీని వదిలి కొత్త పార్టీ స్థాపిస్తాడు. దీనికోసం హిందుత్వ వాది బాబా భజరంగీ (అభిమన్యు సింగ్)తో చేతులు కలుపుతాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శిని (మంజూ వారియర్) వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కాపాడడానికి స్టీఫెన్ తిరిగి ఇండియా రావాలని చాలా మంది కోరుకుంటారు. ఇదే సమయంలో ఇరాక్లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన ఒక దాడిలో స్టీఫెన్ చనిపోయినట్టు వార్తలు వస్తాయి.
అయితే అయితే స్టీఫెన్ నిజంగానే చనిపోయాడా? అసలు స్టీఫెన్ నడుంపల్లిగా కేరళ ప్రజలకు తెలిసిన ఖురేషి అబ్రహం గత చరిత్ర ఏమిటి? పూర్వాశ్రమంలో విదేశాల్లో ఏం చేసేవాడు? అతని కోసం ఇతర దేశాల గూఢచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి? శత్రువులందరూ ఏకమై ఒక్కసారిగా చుట్టుముడితే స్టీఫెన్ ఏం చేశాడు? శత్రువుల వ్యూహాలకు ఎలాంటి ప్రతివ్యూహాలు రచించాడు?
మధ్యలో జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? బాబా భజరంగీ మరియు జయేద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) మధ్య శత్రుత్వానికి కారణం ఏంటి? అలాగే సోదరి ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్)తో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడ్డాయా? సీనియర్ నేత గోవర్దన్ (ఇంద్రజిత్ సుకుమారన్) రాజకీయంగా ఎలాంటి పథకాలు రచించారు? సైతాన్ను ఎందుకు సహాయం కోరాల్సి వచ్చింది? వీటన్నింటినీ దాటుకుని చివరికి స్టీఫెన్ తన రాజ్యాన్ని, ప్రజలను ఎలా కాపాడుకున్నాడు? అన్నదే మిగతా కథ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: