తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ – TFDC) చైర్మన్ దిల్ రాజు ‘గద్దర్ అవార్డ్స్’ జ్యూరీకి కీలక సూచన చేశారు. బుధవారం సంస్థ సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కొరకు వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈ జ్యూరీలో నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 14 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డ్స్ ఇస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫిల్మ్ అవార్డ్స్కి ఇంత స్పందన రాలేదు. తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి” అని కోరారు. కాగా దిల్ రాజు సూచనపై జయసుధ స్పందిస్తూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
ఇక తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ మాట్లాడుతూ.. “జయసుధ ఛైర్మన్గా 15 మందితో కూడిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అవార్డ్స్కి అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయి. ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగనుంది” అని తెలిపారు.
కాగా ఈ గద్దర్ అవార్డుల కోసం వివిధ క్యాటగిరీలకు ఎంట్రీలకు వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు వంటి వివిధ క్యాటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురి తెలిపింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: