డబుల్ ఇస్మార్ట్ తరువాత ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా రీసెంట్ గా రాజమండ్రిలో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డే అండ్ నైట్ షూట్ జరుగుతుంది.ఈషెడ్యూల్ తో 70శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై లోగా సినిమాను కంప్లీట్ చేసి దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.రామ్ బర్త్ డే మే 15న ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.
ఈసినిమా విజయం రామ్ కు తప్పనిసరి కానుంది.రామ్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.దీంతో ఈసారి ఎలాగైనా 22వ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఇప్పటివరకు రామ్ మరో సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు.ప్రస్తుతానికి ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు.మరి ఈసినిమాతో రామ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: