టాలీవుడ్ ప్రముఖ నటి సమంత సోమవారం తిరుపతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ముందుగా తిరుమల కొండకు చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సమంతకు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024
ఈ క్రమంలో ఆలయం బయట సమంతను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం చుట్టుముట్టారు. ఇక ఆ తర్వాత తిరుమల నుంచి బయలుదేరిన సమంత తిరుపతి సమీపంలోని తిరుచానూరు చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అమ్మవారి దర్శనం అనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఆమెకు పట్టు వస్త్రం మరియు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: