లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే కదా. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను చెన్నైలో ప్రారంభించగా ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్, జోజు జార్జ్ ఇంకా అభిరామి ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. కొంత గ్యాప్ తీసుకున్న తరువాత నెక్ట్స్ షెడ్యూల్ ను సైబీరియా, రష్యా ప్రాంతాల్లో షూటింగ్ ను జరపాలని ప్లాన్ చేస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: