బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘యానిమల్’. కాగా ‘యానిమల్’ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే రిలీజైన తర్వాత ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకవైపు సినిమాలో మితిమీరిన హింస, అడల్టరీ సన్నివేశాలు ఉన్నాయని ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం దీనిపై అనేక విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటినీ తట్టుకుని రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అయితే తాజాగా యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే రోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో యానిమల్ హవా థియేటర్లలో తగ్గినట్లేనని అందరూ భావించారు. కానీ దీనికి విరుద్ధంగా ఈ చిత్రం నేటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
మూవీ రిలీజై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అనేకచోట్ల థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో ఒక అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఉత్తర అమెరికా ప్రాంతంలో ఈ చిత్రం 15 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి, తద్వారా ఈ మైలురాయిని అందుకున్న 5వ భారతీయ చిత్రంగా నిలిచింది. మొత్తంగా యూస్ఏలో 7.9 మిలియన్స్, మరియు కెనడాలో దాదాపు 7.1 మిలియన్స్ కలెక్ట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: