టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తాను ప్రయాణం చేస్తున్న విమాన పైలట్ ప్రత్యేకంగా లేఖ రాయడంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అసలేమైందంటే..? ఇటీవల ఆనంద్ దేవరకొండ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా సదరు విమాన పైలట్ సుభాష్.. ఆనంద్ నటనను మెచ్చుకుంటూ స్పెషల్గా ఒక లేఖ రాసి అందించారు. ఆ లేఖలో.. ‘బేబి’ చిత్రం చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ సినిమాలో అద్భుతంగా నటించి ఆనంద్ తన మనసు గెలుచుకున్నాడని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. అలాగే, తన బ్రదర్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ‘హాయ్’ చెప్పమని కూడా పైలట్ కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ పైలట్ రాసిన లేఖపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన తన స్పందనను తెలియజేశారు. తాజాగా జరిగిన ఈ సంఘటనపై ఆయన అందులో ఇలా తెలిపారు.. సుభాష్ ఈ రోజును నాకు ఎంతో ప్రత్యేకంగా మార్చారు. మన వర్క్ను ఎదుటివారు గుర్తించి ప్రశంశించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ‘బేబీ’ సినిమాలో నా నటనకు సంబంధించి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్లో ఇది ఒకటి. కెరీర్ పరంగా నేను ఎన్నో సాధించాల్సి ఉంది. నా ముందున్న లక్ష్యం అదే. ప్రస్తుతం ఈ దిశగానే ముందుకెళ్తున్నా” అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా.. ఆయన ప్రస్తుతం ‘గం..గం..గణేశా’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు.
This lovely gesture from @IndiGo6E pilot Subhash made my day. Thank you captain. ❤️🤗
An incredible feeling when you bump into people who recognise and appreciate your work…this happens almost every other day. The exact feeling is inexplicable. But the goal is to achieve more… pic.twitter.com/CgEoH1QjTk
— Anand Deverakonda (@ananddeverkonda) November 23, 2023
కాగా టాలీవుడ్లో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘బేబి’. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. క్యూట్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి యువతరం ఫిదా అయింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు సైతం అందుకుంది. దీంతో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ పెద్ద సినిమాల స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.95కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అనంతరం ‘బేబి’ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టి.. ఓటీటీ రికార్డులను కూడా బద్దలుకొట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్లోనూ భారీ ఆదరణ దక్కించుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: