సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 నిన్నటి తో 400కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 7కోట్ల నెట్ ను వసూళ్లను సాధించింది.వరల్డ్ కప్ ఈసినిమా కలెక్షన్స్ ను ప్రభావం చేసింది అయితే ఇప్పుడు మాత్రం స్టడీగా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం 10రోజుల్లో దేశ వ్యాప్తంగా 298కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో నెట్ 244.80కోట్లు.ఇక ఓవర్సీస్ లో ఈసినిమా 102.50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా 10రోజుల్లో 400.50కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సల్మాన్ కెరీర్ లో 400 కోట్ల క్లబ్ లో చేరడం ఇది 5వసారి.ఇంతకుముందు భజరంగీ భాయీజాన్,సుల్తాన్ ,టైగర్ జిందా హై,ప్రేమ్ రతన్ ధన్ పాయో తో ఈ ఫీట్ సాధించాడు.ఫుల్ రన్ లో టైగర్ 3,500కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు వున్నాయి.2017లో వచ్చిన టైగర్ జిందా హై కి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.
మనీష్ శర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.ఇమ్రాన్ హష్మీ,రేవతి, సిమ్రాన్ కీలక పాత్రల్లో కనిపించారు.యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈసినిమాను నిర్మించాడు. ఈసినిమాకు సీక్వెల్ గా టైగర్ 4కూడా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: