ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధ పెద్ద కుమార్తె, ‘రంగం’ ఫేమ్ కార్తీక నాయర్, వ్యాపారవేత్త రోహిత్ మీనన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కార్తీక మెడలో మూడు ముళ్ళు వేయడం ద్వారా రోహిత్ మీనన్ ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించారు. నవంబర్ 19న కేరళలోని త్రివేండ్రంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్తో పాటు సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్కుమార్, సుహాసిని మణిరత్నం, రేవతి, మేనక పలువురు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివేండ్రంలోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో జరిగిన ఈ వేడుకలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరుగగా.. కార్తీక, అందమైన బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు చీరను ధరించింది. తాజాగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ మేరకు కార్తీక ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫోటోలు కొన్నింటిని పంచుకున్నారు. అందులో.. “మా రాయల్ ఫెయిరీ టేల్ బిగిన్స్. బ్లెస్డ్ అండ్ కృతజ్ఞతతో” అని పేర్కొన్నారు. కాగా కార్తీక తమిళ డబ్బింగ్ హిట్ చిత్రం ‘రంగం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ మూవీలో ఒక కీలక పాత్రలో నటించారు. ఇంకా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ అనే సినిమాలో అలరించారు.
ఇక కార్తీక తల్లి రాధ కూడా ప్రముఖ నటి అన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో 1980-90ల కాలంలో దాదాపు దశాబ్దం పాటు ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ సహా పలువురితో నటించారు. ముఖ్యంగా ఆమె మెగాస్టార్ తో పోటీపడి డ్యాన్స్ చేసేవారని అభిమానులు చెప్పేవారు. అలాగే మలయాళం లోనూ ఆమె పలు చిత్రాలలో నటించారు. అనంతరం కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిలయ్యారు. ఇక రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారిలో కార్తీక తొలి సంతానం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: