టాలీవుడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలే వేరు. డైలాగ్ రైటర్గాసినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు. ఈ క్రమంలో అనేక అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తనదైన శైలిలో సాగే ప్రాసలతో కూడిన డైలాగ్స్ రాసి కొత్త ఒరవడి సృష్టించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో.. “మా ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి బ్లాక్బస్టర్ బర్త్ డే శుభాకాంక్షలు. వచ్చే ఏడాది ఆయనకు మంచి జరగాలని, మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా” అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈరోజు ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ను నేడు విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ను రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న పాన్-వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణ కథాంశంగా ఈ సినిమా ఉండనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: