రీ రిలీజ్‌కు సిద్దమైన శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

Megastar Chiranjeevi's Shankar Dada MBBS Ready For Re Release

టాలీవుడ్​లో గత కొన్ని నెలలుగా రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోల ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం ద్వారా మంచి లాభాలను కళ్లజూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజై ఘనవిజయం సాధించాయి. ఇక ఇటీవలే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా రీ రిలీజై ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చిత్రం కూడా చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్​కు రెడీ అయింది. మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్‌’ చిత్రాన్ని మళ్లీ రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. నవంబర్ 4న ఈ సినిమాను మెగా ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో కన్వర్ట్‌ చేసి నవంబర్‌ 4న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి జయంత్.సి పరాన్జీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కథానాయికగా నటించగా.. శ్రీకాంత్, పరేశ్ రావల్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమాలో బాస్‌ కామెడీ టైటింగ్‌కు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా ‘లింగం మాయ్యా’ అంటూ చిరు చేసిన కామెడీ కితకితలు పెట్టించింది. ఇందులో చిరు మార్క్‌ కామెడీ, పాటలూ, ఎమోషన్‌ బాగా వర్కవుట్‌ అయ్యాయి. ముఖ్యంగా తెలుగునాట సుపరిచితమైన అనేక సామెతల్ని చిరు ఇంగ్లీష్‌లో తన స్తైల్‌లో పలికిన విధానం నెక్స్ట్ లెవల్ అంతే. ‘వెంకీస్‌ మ్యారేజ్‌.. సుబ్బీస్‌ డెత్ యానివర్సెరీ’, ‘ఇన్ ఫ్రంట్‌ దేర్‌ ఈజ్‌ క్రోకోడైల్స్‌ ఫెస్టివల్‌’ వంటి డైలాగ్స్‌కి థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోయాయి. ఇప్పటికీ ఈ చిత్రాన్ని అభిమానులు గుర్తు చేసుకొంటూనే ఉంటారు.

కాగా బాలీవుడ్ సెన్సేషనల్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైమ్ బ్ల‌క్ బ‌స్ట‌ర్‌ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసేవుంటుంది. పరుచూరి బ్రదర్స్ మాట‌లు అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అప్ప‌ట్లో ఛార్ట్ బస్టర్‌గా నిలిచింది. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఏకంగా వంద రోజులు ఆడింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మరోసారి నవ్వుల జడిలో తడిసిపోయేందుకు మెగా ఫ్యాన్స్ సహా తెలుగు ఆడియన్స్ అందరూ రెడీ అవ్వండి.

ఇక ఇదిలా ఉంటే.. రీసెంట్​గా ‘భోళాశంకర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్.. తన తదుపరి సినిమా (మెగా 157)ను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, అనుష్క కథానాయికలుగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 14 =