బిగ్ బాస్ 7.. కలర్ కోడ్ లో కంటెస్టెంట్ల ట్రూ కలర్స్

bigg boss season 7 telugu day 21 highlights

బిగ్ బాస్ సీజన్ 7 లో సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తయిపోయాయి. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా హౌస్ నుండి బయటకు వెళ్లగా.. మూడో వారం దామిని ఎలిమినేట్ అయింది. మూడో వారంలో దామిని, శుభశ్రీ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ నామినేషన్స్ లోకి రాాగా అతి తక్కువ ఓటింగ్ రావడంతో దామిని ఎలిమినేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకుముందు వీకెండ్స్ లో ఫన్నీ గేమ్స్ ను పెట్టి ప్రేక్షకుల ఓపికకు ఒకరకంగా పరీక్షలు పెట్టేశారు. కానీ ఈసారి ఉల్టా పుల్టా అన్నట్టుగానే కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టే గేమ్స్ నే డిజైన్ చేశారు. హౌస్ లో ఎవరు ఎలాంటి వారో చెప్పాలనే గేమ్ పెట్టాడు. కలర్ వీల్ తిప్పుతూ.. కలర్ కోడ్ లో ఉన్న ప్రశ్నలు అడిగారు. ప్రశ్నను బట్టి అది హౌస్ లో ఎవరికి సెట్ అవుతుందో చెప్పాలి. ఇందులో భాగంగానే మొదటగా ఇంట్లో కన్నింగ్ ఎవరని అడుగగా.. అందుకు శోభాశెట్టి ప్రశాంత్ అని తను నామినేషన్స్ టైమ్ ఒకలాగా.. నార్మల్ టైమ్ లో ఒక లాగ ఉంటాడని చెప్పింది. ఇక ప్రశాంత్ కు తమ ఆట కోసం ఎవరు వాడుకుంటున్నారు అన్న ప్రశ్న ప్రశాంత్ కు రాగా శోభాశెట్టి తను హౌస్ లో అందరినీ వాడుకుంటుందని తెలిపాడు.

అనంతరం తేనె పూసిన కత్తి ఎవరన్న ప్రశ్న దామినికి రాగ అందుకు సందీప్ అని చెప్పింది. సందీప్ కు హౌస్ లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది ఎవరు అన్న ప్రశ్న రాగా అందుకు ప్రిన్స్ యావర్ అని చెబుతాడు. వరస్ట్ క్వాలిటీ ఎవరిది?ఎవరు? అని ప్రశ్న రాగా దానికి రతిక అని తన ముందు ఒకటి చెప్పి ఆ తరువాత ఒకటి మాట్లాడింది అంటూ తెలిపారు. ఆ తరువాత రతికకు నిన్ను ఆటలో కిందకు లాగుతుంది ఎవరు అని అడుగగా.. అందుకు ప్రశాంత్, ప్రిన్స్ యావర్ అని చెప్పింది. అమర్ దీప్ కు ఇంట్లో కపటనాటక సూత్రధారి అన్న ప్రశ్న రాగా దానికి శివాడీ అని.. హౌస్ లో కలుపుమొక్క ఎవరు అన్న ప్రశ్న శివాజీకి రాగ శివాజీ తేజ అని.. ఇంట్లో ఎవరికి పని తక్కువ? తిండి ఎక్కువ అన్న ప్రశ్న తేజకు రాగ అందుకు రతిక అని..శుభ శ్రీ కి హర్ట్ చేసి సంతోషం పొందేది ఎవరు అన్న ప్రశ్న రాగా దానికి దామిని అని.. హౌస్ లో కామన్ సెన్స్ లేనిది ఎవరికి అన్న ప్రశ్న రాగ దానికి ప్రశాంత్ అని..హౌస్ లో నమ్మకూడదు?ఎందుకు అన్న ప్రశ్న గౌతమ్ కు రాగా తేజ అని తెలుపుతాడు.

ఇక ఎలిమినేషన్ ప్రోసెస్ లో దామిని ఫైనల్ గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తరువాత స్టేజ్ పైన బెలూన్ ను పగలకొట్టి హౌస్ మేట్స్ కు సలహాలు సూచనలు ఇవ్వమని దామినిని అడుగగా.. ప్రియాంకకు ఇంకా బాగా ఆడమని చెబుతుంది. శివాజీకి మీరు ఫేవరిటిజం చూపిస్తున్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఇద్దరిమధ్య కాసేపు వాదన జరిగింది. అనంతరం హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది.

కాగా మొదటి వారం సందీప్ పవరాస్త్రను గెలుచుకొని మొదటి ఇంటిసభ్యుడయ్యాడు. ఆతరువాత రెండో వారం శివాజీ పవరాస్త్రను గెలుచుకొని రెండో ఇంటిసభ్యుడయ్యాడు. ఇక మూడోవారంలో శోభా శెట్టి పవరాస్త్రను గెలుచుకొని మూడో ఇంటిసభ్యురాలైంది. మరి ఈవారం ఎవరు పవరాస్త్రను గెలుచుకుంటారు.. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ లు ఇస్తాడు అన్నది చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.