టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ‘ఆదిపురుష్’ ఫేమ్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ని కథానాయికగా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇంతలో ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగుచూసింది. అదేంటంటే.. ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రీసెంట్గా కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించబోతున్నట్లు, అందులోనూ ఆయన శివుడి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సడెన్గా హీరోయిన్ తప్పుకోవడంతో మరోసారి ఈ ప్రాజెక్ట్పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకమునుపే ఇలా హీరోయిన్ తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో అందుకు కారణం ఏంటనేది విష్ణునే తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
మంచు విష్ణు ట్విట్టర్లో ఇలా తెలిపారు.. “కన్నప్ప చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేసే విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుందని తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. ఆమెను ఎంతో మిస్ అవుతున్నాం. ప్రస్తుతం ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టాం. అయితే నుపూర్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్లన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్లో మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఎక్సయిటింగ్ టైం ముందుంది. అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి’’ అని పేర్కొన్నారు.
Sad to announce that lovely @NupurSanon had to step down from #Kannappa due to scheduling conflicts. We’ll miss her, but the hunt for our new leading lady begins! Sending Nupur our best wishes on her other commitments. Hope to work with her in the near future
Exciting times…
— Vishnu Manchu (@iVishnuManchu) September 20, 2023
‘అవా ఎంటర్టైన్మెంట్’ మరియు ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ ప్లస్లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్ మరియు తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. అలాగే మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: