బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో తీసిన ‘జవాన్’ సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్కి తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందించిన అట్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. షారుఖ్తో పాటు అట్లీ కెరీర్లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ నిలిచింది. దీంతో అట్లీ కెరీర్లో ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయని సినీ ప్రియులు గుర్తుచేస్తున్నారు. జవాన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అట్లీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ తర్వాత మరికొందరు బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ.. “షారుఖ్తో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే జవాన్ అద్భుత విజయం సాధించడం గొప్ప అనుభూతినిస్తోంది. అయితే బాలీవుడ్లో నా ఈ ప్రయాణం ఇకపై కూడా కొనసాగించాలనుకుంటున్నాను. నాకు మరో నలుగురు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ మరియు రణబీర్ కపూర్లతో పనిచేయాలని అనుకుంటున్నా. అందులోనూ ముఖ్యంగా సల్మాన్, రణబీర్లతో ముందుగా సినిమాలు తీయాలని ఉంది. అయితే ప్రస్తుతం నేను మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ తర్వాతే ఈ హీరోలను కలిసి సినిమాలు చేసే విషయమై సంప్రదిస్తాను” అని తన మనసులో కోరికను వెల్లడించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: