మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మరో 4రోజుల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈమూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.పాన్ ఇండియా మూవీ కావడంతో తమిళ్ తోపాటు అన్ని భాషల్లో ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను ముందుగా రాజమౌళి కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బాహుబలి రెండు భాగాలుగా తీయకుంటే పొన్నియిన్ సెల్వన్ సాధ్యపడేది కాదేమో అని అన్నారు.అలాగే చిత్ర నిర్మాణ సంస్థ ల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ కి,తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు ఈ సందర్బంగా మణిరత్నం థాంక్స్ చెప్పారు.ఈఈవెంట్ లో విక్రమ్ ,కార్తీ ,జయం రవి ,త్రిష ,ఐశ్వర్యా రాయ్ ,శోభిత దూళిపాళ్ల,ఐశ్వర్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.మద్రాస్ టాకీస్ ,లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా ఈనెల 28న విడుదలకానుంది.కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం,పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు.రెండవ భాగం 2డి తోపాటు 3డిలోకూడా విడుదలకానుంది.
ఇక పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గత ఏడాది విడుదలై సుమారు 400కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది.మరి ఇప్పుడు రానున్న రెండవ భాగం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: