రెండేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా కోరనా ఎలాంటి ప్రభావం చూపించిందో చూశాం. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ కరోనా బారిన పడ్డారు. కొంత మంది సెలబ్రిటీలు మరణించారు కూడా. ఇక
ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. మరి అలా కేసులు మొదలవుతున్నాయో లేదో అప్పుడు కరోనా బారిన పడుతున్నారు సెలబ్రిటీలు కూడా. తాజాగా పోసాని కృష్ణమురళీ కరోనా బారిన పడ్చారు. పూణేలో జరిగిన షూటింగ్ లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రచయితగా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు పోసాని కృష్ణమురళీ. మొదట్లో సీరియస్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిప్పటికీ తరువాత కమెడియన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇక ఈమధ్య పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా నంది అవార్డులపై కూడా కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: